ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

ABN , First Publish Date - 2020-08-06T03:13:47+05:30 IST

నంద్యాల మండలం పొన్నాపురంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. మూడు రోజులుగా ప్రియుడి ఇంటి ముందే బైఠాయించింది. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు ఎవరూ

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

కర్నూలు: నంద్యాల మండలం పొన్నాపురంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. మూడు రోజులుగా ప్రియుడి ఇంటి ముందే బైఠాయించింది. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే బాధిత యువతికి అండగా ఆమె బంధువులు, మహిళా సంఘాల నేతలు నిలిచాయి. రమేష్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇప్పుడు మరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడని బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బాధిత యువతి కన్నీరుమున్నీరయ్యింది.

Updated Date - 2020-08-06T03:13:47+05:30 IST