ప్రేమించి మోసం చేశాడంటూ ధర్నాకు దిగిన మహిళ

ABN , First Publish Date - 2020-07-14T23:50:26+05:30 IST

తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసానికి పాల్పడిన వ్యక్తి ఇంటి ముందు బాధిత మహిళ ధర్నాకు దిగింది. ఈ ఘటన పాలకొల్లులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.

ప్రేమించి మోసం చేశాడంటూ ధర్నాకు దిగిన మహిళ

పశ్చిమగోదావరి: తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసానికి పాల్పడిన వ్యక్తి ఇంటి ముందు బాధిత మహిళ ధర్నాకు దిగింది. ఈ ఘటన పాలకొల్లులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే. పాలకొల్లు ప్రాంతానికి చెందిన శంకర శాస్త్రి, బాధిత మహిళ కొంత కాలంగా సాన్నిహిత్యంగా ఉన్నారు. అయితే.. శంకరశాస్త్రి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా సంబంధం పెట్టుకుని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించింది. ఈ క్రమంలో శంకరశాస్త్రి ఇంటి ముందు ధర్నాకు దిగింది. అయితే సదరు మహిళకు ఇంతకు ముందే వివాహం జరిగిందని, తనను బ్లాక్ మెయిల్ చేసేందుకే ఆమె దీక్ష చేపట్టిందని శంకర శాస్త్రి ఆరోపిస్తున్నాడు. కాగా, ధర్నా చేస్తున్న మహిళకు ఇంతకు ముందే వివాహం అవగా.. అతనితో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-07-14T23:50:26+05:30 IST