మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఆమోదం పొందడంలేదు?
ABN , First Publish Date - 2021-09-15T01:12:15+05:30 IST
మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఆమోదం పొందడంలేదు?
హైదరాబాద్: అవనిలో సగం. ఆకాశంలో సగం. పురుషుడి విజయం వెనుక స్త్రీ. అమ్మే అన్నింటికీ మూలం. ఆడదంటే అబల కాదు.. సబల.. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలపై కవిత్వాలు అలా ఉప్పొంగుతూ వస్తాయి. మహిళా సాధికారిత, నాయకత్వం విషయంలో అమెరికా లాంటి అగ్రరాజ్యంతో పోల్చుకుంటే భారతదేశం బెటరే. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, జయలలిత, మమతాబెనర్జీ, మాయావతిలాంటి వాళ్లు మంచి నాయకత్వాన్ని అందించారు. అయితే చట్టసభల్లో రాజకీయ పరమైన రిజర్వేషన్లు సాకారం కావడంలేదు. సెప్టెంబర్ 12, 1996లో మహిళా రిజర్వేషన్ బిల్లును చట్ట సభల్లో ప్రవేశ పెట్టారు. సరిగ్గా పాతికేళ్లు అయినా ఈ బిల్లుకు అతీగతి లేదు. రాజ్యసభలో పూర్తి అయినా లోక్సభలోకి ఈ బిల్లు ఇంకా చర్చకు రాలేదు.
ఈ నేపథ్యంలో ‘‘అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఆమోదం పొందడంలేదు?. ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే పురుష పుంగవులు ఎందుకు అడ్డుపడుతున్నారు?. ప్రజా ప్రతినిధులుగా మహిళలు చట్ట సభల్లోకి అడుగు పెడితే దేశానికి ఏమైనా నష్టమా?. మహిళా రిజర్వేషన్ బిల్లు పాతికేళ్లుగా చర్చలకే పరిమితమవడం దేశానికి అవమానం కాదా?. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మహిళా ప్రాతినిధ్యం విషయంలో కూడబలుక్కుని తొక్కేస్తున్నారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.