కల్వకుర్తిలో మహిళలను వివస్త్ర చేసి చితకబాదిన మహిళలు

ABN , First Publish Date - 2021-06-12T22:51:20+05:30 IST

కల్వకుర్తిలో మహిళలను వివస్త్ర చేసి చితకబాదిన మహిళలు

కల్వకుర్తిలో మహిళలను వివస్త్ర చేసి చితకబాదిన మహిళలు

నాగర్‌కర్నూలు: అంతులేని ఆవేశంతో కొందరు మహిళలు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. సాటి మహిళ అనే జాలి కూడా అమానవీయంగా దాష్టీకంగా ప్రదర్శిస్తున్నారు. కల్వకుర్తిలో స్థల వివాదంలో జరిగిన దారుణం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఓ మహిళను సాటి మహిళలే వివస్త్రగా చేసి పాశవికంగా చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జేపీ నగర్ తండాలోని  వివాదస్పద స్థలంలో ఓ మహిళ నిర్మిస్తున్న ఇంటిని ఆపాలని తండా వాసులు అభ్యంతరం చెప్పారు. దాంతో ఆమె మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకుని తిరిగి ఇంటిని నిర్మాణం కొనసాగించింది. 


ఈ నెల 9న మళ్లీ తండా వాసులు వచ్చి ఇంటి నిర్మాణం అడ్డుకోబోగా ఓ వ్యక్తితో ఆమె వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. దాంతో పదో తేదీ మధ్యాహ్నం పలువురు మహిళలు ఆమె ఇంటికి వెళ్లి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని విడిపించేశారు. బాధితురాలిని వేరే చోటికి తరలిస్తుండగా తండా వాసులు వెంబడి వివస్త్రను తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులు ఆమెను రక్షించి ఇంటికి పంపారు. ప్రస్తుతం తండాలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఇరువర్గాలపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేశారు. 


Updated Date - 2021-06-12T22:51:20+05:30 IST