మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2021-03-05T05:55:55+05:30 IST

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జగిత్యాల జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
జడ్పీ చైర్‌పర్సన్‌ను సన్మానిస్తున్న మహిళలు

జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత

జగిత్యాల టౌన్‌, మార్చి 4: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు  అన్ని రంగాల్లో రాణించాలని జగిత్యాల జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత అన్నారు. రుద్రమ సాహితీ స్రవంతి సంస్థ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కౌసల్య తెలుగు పండిత బీఈడీ కళాశాలలో గురువారం ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అథితులుగా బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి, జిల్లా పరిషత్‌ అ ధ్యక్షురాలు దావ వసంత హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రా రంభించారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను రుద్రమ సా హితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ అడువాల సుజాత ఆధ్వర్యంలో షాలువాలతో ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్య క్రమంలో జిల్లా సైనిక సంక్షేమశాఖ సలహా మండలి సభ్యురాలు సిరిసిల్ల రాజేశ్వరి, వైద్యురాలు హర్షిత, చిందం సునీత, మేన్నేని నీలిమ, మీనాక్షి, ఉజగిరి జమున, సాకేత, కవిత, లావణ్య, శోభ, సరోజన, విజయలక్ష్మి, సామాజిక వేత్త రేగొండ నరేష్‌ ఉన్నారు.


Updated Date - 2021-03-05T05:55:55+05:30 IST