ఇది ఆత్మ‘హత్యా’.. భర్తపైనే అనుమానాలు?

ABN , First Publish Date - 2021-03-02T14:49:55+05:30 IST

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన ఉప్పల్‌ పీఎస్‌ పరిధిలోని

ఇది ఆత్మ‘హత్యా’.. భర్తపైనే అనుమానాలు?

హైదరాబాద్/ఉప్పల్‌ : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన ఉప్పల్‌ పీఎస్‌ పరిధిలోని గాంధీనగర్‌లో చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన యాదగిరి భార్య అనిత(35)తో కలిసి ఉప్పల్‌ గాంధీనగర్‌లో ఉంటున్నాడు. గతంలో ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లిళ్లు అయినప్పటికీ, విడిపోయారు. ఏడేళ్ల క్రితం వీరు వివాహం చేసుకున్నట్లు సమాచారం. కొంతకాలంగా బోడుప్పల్‌లో నివసించిన వీరు నెల రోజుల క్రితమే గాంధీనగర్‌కు వచ్చినట్లు స్థానికులు చెప్పారు.


సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో అనిత మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వచ్చి చూడగా, ఆమె తలపై గాయాలున్నాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా హతమార్చారా అనే కోణంలో  దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య జరిగిన అంతర్గత గొడవలే అనిత మృతికి కారణమని  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-02T14:49:55+05:30 IST