ఉక్కు పరిరక్షణకు మహిళల గర్జన

ABN , First Publish Date - 2021-10-28T02:06:21+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం వందలాది మందితో మహిళా

ఉక్కు పరిరక్షణకు మహిళల గర్జన

విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం వందలాది మందితో మహిళా గర్జన నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌లోని తెలుగుతల్లి విగ్రహం నుంచి ప్లాంట్‌ పరిపాలన భవనం వరకు మహిళలు ర్యాలీగా వెళ్లారు. ‘సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌’, ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించరాదని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన మార్గంలో కొద్ది సమయం పాటు మహిళలు రహదారిపై బైఠాయించారు. 

Updated Date - 2021-10-28T02:06:21+05:30 IST