‘అమ్మ ఎవరితోనో వెళ్లిపోయింది.. నాన్న మద్యం దుకాణం దగ్గరే ఉంటున్నాడు.. అంటూ ఆ యువతి ఏంచేసిందంటే..

ABN , First Publish Date - 2021-10-23T12:26:00+05:30 IST

తల్లిదండ్రుల నీతిమాలిన పనులకు ఒక యువతి..

‘అమ్మ ఎవరితోనో వెళ్లిపోయింది.. నాన్న మద్యం దుకాణం దగ్గరే ఉంటున్నాడు.. అంటూ ఆ యువతి ఏంచేసిందంటే..

తల్లిదండ్రుల నీతిమాలిన పనులకు ఒక యువతి బలైపోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. హిరణ్మగరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రిమగర్‌లో ఉంటున్న మీనా అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. బీఈడీ చదువుతున్న మీనా తాను ఆత్మహత్య చేసుకునేముందు ఒక నోట్ రాసింది. దానిలో ఆమె తన తల్లి ఎవరితోనే వెళ్లిపోయిందని, తండ్రి మద్యానికి బానిసయ్యాడని, ఇటువంటి పరిస్థితుల్లో ఏంచేయాలి? నన్నెవరు చూసుకుంటారనే ఆవేదనతో ఈ దిశగా అడుగువేస్తున్నానని పేర్కొంది. కాగా ఆ యువతి కొంతకాలం క్రితం ఒక యువకునిపై అత్యాచారం కేసు పెట్టింది. 


అయితే ఆ తరువాత రాజీపడి కేసు వెనక్కి తీసుకుంది. మీనా బంధువులు.. ఆమె ఆత్మహత్యకు ఆ యువకుడే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతం గురించి పోలీసులు మాట్లాడుతూ మూడు రోజులుగా ఆమె ఉంటున్న గది తలుపులు మూసివుండటంతో స్థానికులు సూచన మేరకు ఇంటి యజమాని తలుపులు తట్టాడని, ఎంతకీ తీయకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్ళగా, యువతి ఉరితాడుకు వేలాడుతుండటం చూశాడన్నారు.  వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడని, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంనకు తరలించారన్నారు. విషయం తెలుసుకున్న మృతురాలి తండ్రి ఆసుపత్రిలోని మార్చురీ దగ్గరకు చేరుకున్నారు. తమ కుమార్తె ఆత్మహత్యకు వికాస్ అనే యువకుడే కారణమని ఆరోపించారు. తమ కుమార్తెను పెళ్లి  చేసుకుంటానని చెప్పి వికాస్ వంచించాడన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2021-10-23T12:26:00+05:30 IST