వర్క్ ఫ్రం హోం నియంత్రణకు చట్టం!
ABN , First Publish Date - 2021-12-07T13:54:55+05:30 IST
వర్క్ ఫ్రమ్ హోం పేరుతో..
విధివిధానాలను రూపొందించనున్న కేంద్రం
న్యూఢిల్లీ: ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోం పేరుతో కంపెనీలు ఉద్యోగులను పిండేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నిబంధనలు రూపొందించనుంది. ముఖ్యంగా కచ్చితమైన పని గంటలను నిర్ణయించి అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఉద్యోగులకు విద్యుత్తు, ఇంటర్నెట్, ఇంట్లో ఉపయోగించే ఆఫీస్ స్పేస్/ఫర్నిచర్కు కంపెనీలు డబ్బులు చెల్లించేలా నిబంధనలను మార్చనున్నారు. చట్టంలో ఉండాల్సిన అంశాలను, ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాల మదింపు విధానాలను అధ్యయనం చేసేందుకు ఒక కన్సల్టెన్సీ సంస్థను నియమించనున్నారు.