పల్లె ప్రకృతివనాల పనులను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-09-25T06:17:32+05:30 IST
గ్రామాల్లో నిర్మిస్తున్న పల్లె ప్రకృతివనాల పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని
రాయికోడ్, సెప్టెంబరు 24 : గ్రామాల్లో నిర్మిస్తున్న పల్లె ప్రకృతివనాల పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మహ్మదాపూర్, సింగితం తదితర గ్రామాల్లో పల్లె ప్రకృతివనాలు, రైతు వేదిక పనులను పరిశీలించారు. మహ్మదాపూర్లో నిర్మిస్తున్న చిల్డ్రన్స్ పార్కును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి, సర్పంచ్ను అభినందించారు. గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యానికి సర్పంచ్ కార్యదర్శులు కృషిచేయాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా తీసుకుపోయి డంపింగ్యార్డులో వెయ్యాలన్నారు.