రానున్న ఎన్నికలే లక్ష్యంగా పనిచేయండి
ABN , First Publish Date - 2021-10-23T05:15:16+05:30 IST
రానున్న 2024 ఎన్ని కల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గం లో వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అప్పల రాజు తెలిపారు.
కవిటి: రానున్న 2024 ఎన్ని కల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గం లో వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అప్పల రాజు తెలిపారు.శుక్రవారం కవి టిలో ఎంపీపీ కడియాల పద్మ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త సాయిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ పి.విజయ, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, ఇచ్ఛాపురం, కంచిలి ఏఎంసీ చైర్మన్లు చాట్ల సుజాత, ఎం.మంజు, చైర్మన్లు ఎన్.రామారావు, శ్యామ్ప్రసాద్ రెడ్డి, కె.ప్రకాష్, పి.నేతాజి, పి.శేఖర్ పాల్గొన్నారు.