ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులా?

ABN , First Publish Date - 2020-12-01T06:27:22+05:30 IST

ప్రజా సమస్యలను ప్రశ్నించే వారి గొంతు నొక్కే దిశగా పోలీసులతో అరెస్టులు చేయిస్తూ నియంత పాలనను తలపించే విధంగా వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని టీడీపీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఎరుబోతు రమణారావు అన్నారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులా?
టీఎన్‌టీయూసీ నేతలతో టీడీపీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఎరుబోతు రమణారావు

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులా?

టీడీపీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఎరుబోతు రమణారావు

 అజిత్‌సింగ్‌నగర్‌, నవంబరు 30: ప్రజా సమస్యలను ప్రశ్నించే వారి గొంతు నొక్కే దిశగా పోలీసులతో అరెస్టులు చేయిస్తూ నియంత పాలనను తలపించే విధంగా వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని టీడీపీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఎరుబోతు రమణారావు అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గాంధీనగర్‌లో సోమవారం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, ఇతర కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేసి అజిత్‌సింగ్‌నగర్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే టీడీపీ నేతలు అజిత్‌సింగ్‌నగర్‌ స్టేషన్‌కు చేరుకుని అరెస్టులను ఖండించారు.  టీఎన్‌టీయూసీ రాష్ట్ర నేత పరుచూరి ప్రసాద్‌, సెంట్రల్‌ టీడీపీ నేతలు డాల్డా శ్రీను, షేక్‌ జాన్‌వలి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T06:27:22+05:30 IST