కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-05-23T09:06:05+05:30 IST

కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా నాయకులు కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌కు

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించిన కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా నాయకులు 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా నాయకులు కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికుల చట్టాల రద్దు, సవరణ ఆపాలని, పనిదినాలను 12 గంటలకు పెంచే నిర్ణయాన్ని ఉపసంహరించాలన్నారు.


పని కల్పిస్తామని వలస కార్మికు లకు గ్యారెంటీ  ఇవ్వాలని, సొంతూళ్లకు వెళ్లే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణ, ఆహార, ఆరోగ్య రక్షణ కల్పిం చాలని కోరారు. పరిశ్రమల్లో వేతనాల కోత, కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపు ఆపాలన్నారు. కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చినవారిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి.జగదీష్‌, జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్‌, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పి.పర్వతాలు, జిల్లా కార్యదర్శి యాదయ్య, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తం, జిల్లా కార్యదర్శి ఆర్‌. ఝాన్సీ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-05-23T09:06:05+05:30 IST