ప్రపంచం 3వ వేవ్ను ఎదుర్కుంటోంది, భారత్కు రాకుండా చూడాలి: కేంద్రం
ABN , First Publish Date - 2021-07-14T05:24:29+05:30 IST
ప్రపంచం ప్రస్తుతం థర్డ్ వేవ్ను ఎదుర్కొంటోందని నీతీ అయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రపంచం ప్రస్తుతం థర్డ్ వేవ్ను ఎదుర్కుంటోందని నీతీ అయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ తెలిపారు. అయితే..ఇది భారత్లో అడుగుపెట్టకుండా ప్రజలందరూ చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం నాడు జరిగిన పత్రికా సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. కరోనా అత్యవసర ప్యాకేజీ కింద కేంద్రం రూ.23123 కోట్ల రూపాలయను మంజూరు చేసిందని కూడా డా. పాల్ తెలిపారు. ఈ నిధులను ఐసీయూ బెడ్లు, పేడియాట్రిక్ యూనిట్లు, అదనపు బెడ్లు, ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు వినియోగిస్తామని పేర్కొన్నారు.