షూటింగ్‌లో భారత్‌కు 13వ స్వర్ణం

ABN , First Publish Date - 2021-10-10T07:33:56+05:30 IST

వరల్డ్‌ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది.

షూటింగ్‌లో భారత్‌కు 13వ స్వర్ణం

లిమా (పెరూ): వరల్డ్‌ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన పోటీల్లో  భారత్‌ మూడు పసిడి పతకాలను సొంతం చేసుకొంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో అనీష్‌, ఆదర్ష్‌, విజయ్‌వీర్‌ త్రయం పసిడి నెగ్గింది. మహిళల డబుల్‌ ట్రాప్‌ విభాగంలో మాన్వీ, పురుషుల డబుల్‌ ట్రాప్‌లో వినయ్‌ ప్రతాప్‌ స్వర్ణాలు నెగ్గారు. పతకాల పట్టికలో భారత్‌ 13 స్వర్ణాలతో కలిపి మొత్తం 30 మెడల్స్‌ను సాధించి అగ్రస్థానంలో ఉంది.

Updated Date - 2021-10-10T07:33:56+05:30 IST