స్విస్ ఓపెన్ ఫైనల్కు చేరిన పీవీ సింధు
ABN , First Publish Date - 2021-03-07T00:22:49+05:30 IST
నేడు జరిగిన సెమీఫైనల్లో డెన్మార్క్కు చెందిన మియా బ్లిచ్ఫెల్ట్ను వరుస సెట్లలో మట్టికరిపించి ఫైనల్
స్విట్జర్లాండ్: హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగిన సెమీఫైనల్లో డెన్మార్క్కు చెందిన మియా బ్లిచ్ఫెల్ట్ను వరుస సెట్లలో మట్టికరిపించి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. నాలుగో సీడ్ క్రీడాకారిణి అయిన మియాను 22-20, 21-10తో ఓడించింది.
2019లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్స్ తరువాత ఫైనల్కు వెళ్లడం సింధుకు ఇదే తొలిసారి. ఇక, మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్స్లోకి కిడాంబి శ్రీకాంత్ ప్రవేశించాడు. థాయిలాండ్కు చెందిన సిక్త్ సీడ్ కంటఫాన్ వాంగ్చరోయెన్తో శుక్రవారం రాత్రి జరగిన మ్యాచ్లో శ్రీకాంత్ చెలరేగిపోయాడు. 21-19, 21-15తో వరుస గేముల్లో విజయం సాధించాడు.