Nellore : శ్రీహరికోటలో నేటి నుంచి అంతరిక్ష వారోత్సవాలు..
ABN , First Publish Date - 2021-10-04T13:08:22+05:30 IST
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నేటి నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయి.
నెల్లూరు : ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నేటి నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయి. జిల్లాలోని సూళ్లూరుపేట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో నేటి నుంచి అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
ఇవాళ ఉదయం 10:30 గంటలకు గవర్నర్ శ్రీహరికోట చేరుకోనున్నారు. మరోవైపు.. ఆన్లైన్ ద్వారా నాలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్, ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన ప్రదర్శనలు, ఫిలిం షోలు, సదస్సులు.. చివరగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.