అధ్వానంగా రహదారులు
ABN , First Publish Date - 2021-10-25T04:45:24+05:30 IST
జొన్నగిరిలోని ఎస్సీ కాలనీలో దాదాపు కిలోమీటరు వరకు ప్రధాన రహదారి గుంతలు పడి మురుగు నీరు నిలిచింది.
తుగ్గలి, అక్టోబరు 24: జొన్నగిరిలోని ఎస్సీ కాలనీలో దాదాపు కిలోమీటరు వరకు ప్రధాన రహదారి గుంతలు పడి మురుగు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మురుగు నిల్వ ఉండడంతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
సి.బెళగల్: సి.బెళగల్ నుంచి సంగాల గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలు ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాల్లోతు గుంతలు పడడంతో ప్రయాణం చాలా కష్టంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే వారే కరువయ్యారని వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్ల మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.