చంద్రబాబు, లోకేశ్ కొవిడ్ నుంచి కోలుకోవాలని పూజలు
ABN , First Publish Date - 2022-01-19T06:59:05+05:30 IST
కరోనా బారిన పడిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ త్వరగా కోలుకోవాలని మంగళవారం అలిపిరి వద్ద ఆ పార్టీనేతలు కొబ్బరికాయలు కొట్టి వేడుకున్నారు.
తిరుపతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ త్వరగా కోలుకోవాలని మంగళవారం అలిపిరి వద్ద ఆ పార్టీనేతలు కొబ్బరికాయలు కొట్టి వేడుకున్నారు. టీడీపీ నేతలు సుగుణమ్మ, నరసింహ యాదవ్, బీద రవిచంద్ర, సూరా సుధాకర్ రెడ్డి, పుష్పావతి, చినబాబు, దంపూరి భాస్కర్, సదాశివం తదితరులు పాల్గొన్నారు.