డోపింగ్ నేరం.. రెజ్లర్‌పై నాలుగేళ్ల నిషేధం

ABN , First Publish Date - 2020-02-02T01:55:37+05:30 IST

గత ఏడాది జరిగిన అండర్-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన రెజ్లర్ రవీందర్ కుమార్‌పై నాలుగేళ్ల పాటు నిషేధం

డోపింగ్ నేరం.. రెజ్లర్‌పై నాలుగేళ్ల నిషేధం

గత ఏడాది జరిగిన అండర్-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన రెజ్లర్ రవీందర్ కుమార్‌పై నాలుగేళ్ల పాటు నిషేధం పడింది. నిషేధపదార్థాన్ని రవీందర్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో అతనిపై నిషేధం విధించారు. గత ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పరీక్షల కోసం రవీందర్ నమూనాలను తీసుకున్నారు. ఆ తర్వాత పరీక్షలో అతను నిషేధ పదార్థం తీసుకున్నట్లు రుజువైంది. దీంతో అక్టోబర్-నవంబర్‌లో అతను సాధించిన ఛాంపియన్‌షిప్ పతకం అధికారులు వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అంతేకాక.. అతను విచారణకు కూడా హాజరుకాలేదని తెలుస్తోంది.  

Updated Date - 2020-02-02T01:55:37+05:30 IST