దుండగుల కాల్పుల్లో రెజ్లర్ నిషా, ఆమె సోదరుడు మృతి

ABN , First Publish Date - 2021-11-11T00:27:44+05:30 IST

సోనెపట్: హర్యానా సోనెపట్‌లో దారుణం జరిగింది. సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడెమీలో రెజ్లర్ నిషా దహియాను, ఆమె సోదరుడిని దుండగులు కాల్చి చంపారు.

దుండగుల కాల్పుల్లో రెజ్లర్ నిషా, ఆమె సోదరుడు మృతి

సోనెపట్: హర్యానా సోనెపట్‌లో దారుణం జరిగింది. సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడెమీలో రెజ్లర్ నిషా దహియాను, ఆమె సోదరుడిని దుండగులు కాల్చి చంపారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన నిషా తల్లి ధన్‌పాటి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె రోహ్‌తక్‌లోని పీజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిషా దహియా, ఆమె సోదరుడి మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం పంపారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదయమే నిషా దహియాను, ఇతర మెడల్స్ విజేతలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారని తెలిసింది. 


సెర్బియా బెల్‌గ్రేడ్‌లో గత వారం జరిగిన అండర్ 23 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 65 కేజీల విభాగంలో నిషా కాంస్యపతకం సాధించారు.  


Updated Date - 2021-11-11T00:27:44+05:30 IST