ఇంకా ప్రారంభం కాని మ్యాచ్.. ఈ రోజు కూడా వర్షార్పణమేనా?

ABN , First Publish Date - 2021-06-21T22:11:02+05:30 IST

చూస్తుంటే భారత్-న్యూజిలాండ్ మధ్య నేడు జరగాల్సిన నాలుగో రోజు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తోంది. సౌతాంప్టన్‌లో

ఇంకా ప్రారంభం కాని మ్యాచ్.. ఈ రోజు కూడా వర్షార్పణమేనా?

సౌతాంప్టన్: చూస్తుంటే భారత్-న్యూజిలాండ్ మధ్య నేడు జరగాల్సిన నాలుగో రోజు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తోంది. సౌతాంప్టన్‌లో తెల్లవారుజాము నుంచి ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. మధ్యలో కొంత తెరిపినిచ్చినప్పటికీ చినుకులు మాత్రం పడుతూనే ఉన్నాయి. దీంతో నిర్ణీత సమయానికి ప్రారంభం కావాల్సిన ఆట వాయిదా పడింది. టెస్టు ప్రారంభమై నేటికి నాలుగో రోజు కాగా, తొలి రోజు పూర్తిగా రద్దు అయింది.


రెండో రోజు ఆట కొనసాగింది. ఇక మూడో రోజైన నిన్న కూడా కొంత ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. మధ్యలో జల్లులు కురవడంతో కాసేపు ఆగినప్పటికీ మళ్లీ మొదలైంది. ఇక, నేటి ఉదయం నుంచి వర్షం ఏకదాటిగా కురుస్తూనే ఉంది. పిచ్ తడకుండా మైదానంలో కవర్లు కప్పి ఉంచినప్పటికీ వాటిపైనా నీరు పెద్ద ఎత్తున నిలిచింది. మైదానం కూడా చిత్తడిగా మారింది. చూస్తేంటే వర్షం ఇప్పుడు తగ్గేలా కనిపించడం లేదు. ఆట ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని బీసీసీఐ పేర్కొంది. మ్యాచ్ జరిగే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల క్రికెటర్ల ముచ్చట్లలో మునిగిపోయారు.  

Updated Date - 2021-06-21T22:11:02+05:30 IST