చీరాలలో జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2021-04-21T09:24:39+05:30 IST

కరోనాకు బాధ్యుడంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో మంగళవారం మాజీమంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

చీరాలలో జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మ దహనం

చీరాల, ఏప్రిల్‌ 20: కరోనాకు బాధ్యుడంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో మంగళవారం మాజీమంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో కోట్లాది మంది ప్రాణాలను బలితీసుకున్న కరోనా మహమ్మారికి కారకుడైన జిన్‌పింగ్‌ను ఉరితీయాలని డిమాండ్‌చేశారు. దేశంలో సంక్షోభం నెలకొనటానికి, అన్నివిధాలుగా నష్టపోవటానికి కరోనా వైరస్సే కారణమన్నారు. తక్షణమే జిన్‌పింగ్‌పై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిన్‌పింగ్‌ను చంపేయాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. 

Updated Date - 2021-04-21T09:24:39+05:30 IST