యాదాద్రిలో వివాహిత అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-09-19T14:08:12+05:30 IST
జిల్లాలోని మోత్కుర్లో వివాహిత పుష్ప అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
యాదాద్రి-భువనగిరి: జిల్లాలోని మోత్కుర్లో వివాహిత పుష్ప అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె భర్త జహంగీర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.