భక్తజనసంద్రం.. యాదాద్రి క్షేత్రం

ABN , First Publish Date - 2022-01-10T01:27:14+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది.

భక్తజనసంద్రం.. యాదాద్రి క్షేత్రం

యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవు రోజుకావడంతో ఇష్టదైవాలను దర్శించుకుని, మొక్కు తీర్చుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, సేవా మండపాలు, తిరువీధుల్లో యాత్రాజనుల రద్దీ ఏర్పడింది. స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో గంటల కొర్దీ నిరీక్షించారు. దేవదేవుడి ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంటపాటు నిరీక్షించామని భక్తులు తెలిపారు. కొండకింద పాత గోశాలలోని వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా భక్తుల వాహనాలను పోలీసులు కొండకిందే పార్కింగ్‌ చేయించారు. 

Updated Date - 2022-01-10T01:27:14+05:30 IST