భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం
ABN , First Publish Date - 2021-12-17T17:31:16+05:30 IST
భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం జరిగింది.
యాదాద్రి-భువనగిరి: భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసుకున్న ఎనిమిదిమంది మహిళలకి కుట్లు విడిపోయాయి. ఏడు రోజుల కిందట 8 మంది మహిళలకు జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. కుట్లు విడిపోవటంతో ఆ ప్రదేశంలో కొంత మంది మహిళలకు ఇన్ఫెక్షన్ వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.