Yadadri Swarna తాపడానికి రూ. 50 లక్షల విరాళం

ABN , First Publish Date - 2022-01-18T16:28:38+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహ్మస్వామి విమాన గోపురానికి 125 కిలోల బంగారు తాపడం కోసం కార్వాన్‌ నియోజకవర్గం

Yadadri Swarna తాపడానికి రూ. 50 లక్షల విరాళం

హైదరాబాద్/మెహిదీపట్నం: యాదాద్రి లక్ష్మీనరసింహ్మస్వామి విమాన గోపురానికి 125 కిలోల బంగారు తాపడం కోసం కార్వాన్‌ నియోజకవర్గం బీజేపీ సీనియర్‌ నాయకుడు బండారి శ్రీనివాస్‌ బ్రదర్స్‌ సోమవారం యాదాద్రి ఆలయ ఈవో గీతను కలిసి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం లక్ష్మీనరసింహ్మస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో బండారి శ్రీనివాస్‌ దంపతులు, సత్యనారాయణ, కృష్ణ, నరసింహ, వెంకటేష్‌, నాగరాజ్‌, ధనరాజ్‌, గణేష్‌ సాయి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T16:28:38+05:30 IST