Yadadri కి పోటెత్తిన భక్తజనం..
ABN , First Publish Date - 2021-10-03T17:04:01+05:30 IST
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో...
యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో భక్తులు రద్దీ నెలకొన్నది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. అభివృద్ధి పనులు దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతించడం లేదు. కాగా.. ఇవాళ మధ్యాహ్నానికి మరింత భక్త జనం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.