యాదాద్రి క్షేత్రంలో శ్రావణ భక్తుల సందడి

ABN , First Publish Date - 2021-08-15T02:00:38+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల పూజల సందడి నెలకొంది. పవిత్ర శ్రావణమాసం వారాంతం కావడంతో

యాదాద్రి క్షేత్రంలో శ్రావణ భక్తుల సందడి

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల పూజల సందడి నెలకొంది. పవిత్ర శ్రావణమాసం వారాంతం కావడంతో హరిహరులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనాల కోసం గంటల తరబడి దర్శన క్యూలైన్లలో వేచి ఉన్నారు. ధర్మ దర్శనాలకు 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామికి శనివారం నిత్యపూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాలాలయంలో ఉత్సవమూర్తులను అభిషేకించి, అర్చించారు. అనంతరం హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ వేడుకలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. స్వామికి శనివారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.17,90,675 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-08-15T02:00:38+05:30 IST