యాదాద్రి-భువనగిరిలో లారీని ఢీకొన్న కారు..దంపతులు మృతి

ABN , First Publish Date - 2021-06-21T14:11:41+05:30 IST

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడిక్కడే మృతి చెందగా..కూతురు పరిస్థితి

యాదాద్రి-భువనగిరిలో లారీని ఢీకొన్న కారు..దంపతులు మృతి

యాదాద్రి-భువనగిరి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడిక్కడే మృతి చెందగా..కూతురు పరిస్థితి విషమంగా ఉంది. కూతురు సారాను స్థానికులు వెంటనే హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బీబీనగర్ మండలం గూడూరు బస్‎స్టాప్ సమీపంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు ప్రశాంత్, శిరీషలు పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-06-21T14:11:41+05:30 IST