జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా యాదయ్య
ABN , First Publish Date - 2021-10-22T04:59:41+05:30 IST
జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా యాదయ్య
బంట్వారం : జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం మాలసోమారం గ్రామానికి చెందిన యాదయ్య ఎంపికయ్యారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం 90వ జయంతిని పురస్కరించుకుని లీడ్ ఇండియా ఫౌండేషన్ తెలంగాణ, ఇతర 17 రాష్ట్రాలలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2021ల కోసం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన యాదయ్య గురువారం రవీంద్రభారతిలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. కాగా, యాదయ్య గతంలో బంట్వారం జడ్పీ ఉన్నత పాఠశాల, మైలార్దేవరంపల్లి పాఠశాలలో 14 సంవత్సరాలు సేవలందించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని భగత్సింగ్నగర్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.