కోలాహలంగా ఎడ్ల పోటీలు

ABN , First Publish Date - 2021-01-27T05:56:01+05:30 IST

పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో గల డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు కోలాహలంగా జరుగుతున్నాయి.

కోలాహలంగా ఎడ్ల పోటీలు
విజేతలకు బహుమతులు ప్రధానం చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి

నరసరావుపేట రూరల్‌, జనవరి 26: పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో గల డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు కోలాహలంగా జరుగుతున్నాయి. సోమవారం జరిగిన ఆరుపళ్ళ విభాగంలో చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణ చౌదరిలకు చెందిన ఎడ్ల జత 4,379 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన బండికల్లు మధుసూధనరావు నాయుడుకు చెందిన ఎడ్ల రెండో స్థానంలో కాకుమాను మండలం కొండపాటూరు గ్రామానికి చెందిన పోతిన లక్షిత్‌ చౌదరికి చెందిన ఎడ్ల జత తృతీయ స్థానంలో నిలిచాయి. నాలుగు పళ్ళ విభాగంలో ప్రకాశం జిల్లా కంభం మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన వెంకటగిరి హేమలత నాయుడుకు చెందిన ఎడ్ల జత 4,685 ప్రథమ స్థానంలో నిలిచాయి. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 4,677  ద్వితీయ, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కలసపాడు మండలానికి చెందిన దేసి వెంకటరెడ్డికి చెందిన ఎడ్ల జత తృతీయ స్థానంలో నిలిచాయి.  ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు మోరే రవీంద్రారెడ్డి, కనక పుల్లారెడ్డి బహుమతులను ప్రదానం చేశారు.  

Updated Date - 2021-01-27T05:56:01+05:30 IST