వ్యవసాయరంగంలో ఖర్చుల్ని తగ్గించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-18T05:49:43+05:30 IST

వ్యవసాయంలో ఖర్చులు, రసాయన మందుల వినియోగం తగ్గించుకున్నప్పుడు నాణ్యమైన దిగుబడులు వస్తాయని టుబాకో బోర్డు చైర్మన యడ్లపాటి రఘునాథబాబు అన్నారు.

వ్యవసాయరంగంలో ఖర్చుల్ని తగ్గించుకోవాలి
మాట్లాడుతున్న యడ్లపాటి రఘునాథబాబు

టుబాకోబోర్డు చైర్మన యడ్లపాటి రఘునాథబాబు

గుంటూరు(విద్య, సంగడిగుంట), అక్టోబరు 17: వ్యవసాయంలో ఖర్చులు, రసాయన మందుల వినియోగం తగ్గించుకున్నప్పుడు నాణ్యమైన దిగుబడులు వస్తాయని టుబాకో బోర్డు చైర్మన యడ్లపాటి రఘునాథబాబు అన్నారు. భారతీయ కిసాన సంఘ్‌ ఆంధ్రప్రదేశ ఆధ్వర్యంలో అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో వ్యవసాయ సమస్యలు సమాధానాలు అనే అంశంపై నిర్వహించిన  సదస్సులో ఆయన మాట్లాడారు. 70 సంవత్సరాల్లో ఏడు రెట్లకుపైగా పంట ఉత్పత్తి పెంచినా రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నేడు నెలకొందని  ఆందోళన వ్యక్తం చేశారు.  రాషీ్ట్రయ స్వయంసేవక్‌ సంఘం ప్రాంతీయ సంచాలక్‌ నాగరెడ్డికుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం రూపొందించిన వ్యవసాయచట్టాలు రైతులకు మేలు చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో జలగం కుమార్‌స్వామి, భారతీయకిసాన సంఘ్‌ నాయకలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-18T05:49:43+05:30 IST