చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-09-18T06:26:49+05:30 IST

యానానికి చెందిన తనికి శ్రీను అలియాస్‌ గోవిందు(45) చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. చింతవారివీధికి చెందిన కోన సుబ్బారావు(చంటి) తనవద్ద పనిచేస్తున్న శ్రీనును గమేల తీసుకెళ్లిన విషయంలో రెండుసార్లు బలంగా కొట్టాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

యానాం, సెప్టెంబరు 17: యానానికి చెందిన తనికి శ్రీను అలియాస్‌ గోవిందు(45) చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. చింతవారివీధికి చెందిన కోన సుబ్బారావు(చంటి) తనవద్ద పనిచేస్తున్న శ్రీనును గమేల తీసుకెళ్లిన విషయంలో రెండుసార్లు బలంగా కొట్టాడు. ఈ నేపథ్యంలో అతడి తలకు బలమైన గాయమై రక్తం గడ్డ కట్టినట్టు స్కానింగ్‌ ద్వారా తెలిసింది. దీంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరి మగాపు కుమారి ఫిర్యాదు మేరకు కోన సుబ్బారావు(చంటి)పై హత్య కేసు నమోదు చేశారు. ఎస్‌హెచ్‌ఓ రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-18T06:26:49+05:30 IST