రాష్ట్రంలో ప్రస్తుతం భయంకరమైన పరిస్థితులున్నాయి: యనమల
ABN , First Publish Date - 2020-05-28T16:30:04+05:30 IST
అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలను కూడా లెక్క చేయనన్న రీతిలో జగన్ వ్యవహారం ఉందన్నారు. రాజ్యాంగం, కోర్టుల మీద గౌరవం లేకుండా జగన్ నిర్ణయాలు ఉన్నాయన్నారు. పథకాల రూపంలో నిధులు ఇస్తూ వసూళ్ల రూపంలో వెనక్కి లాగేసుకుంటున్నారని యనమల విమర్శించారు. హిట్లర్ ఆలోచనల రీతిలోనే జగన్ తీరూ ఉందన్నారు.