రాష్ట్రాన్ని దొంగ ఓట్లు, దొంగ నోట్ల రాజ్యంగా చేశారు: యనమల
ABN , First Publish Date - 2021-04-18T19:43:24+05:30 IST
రాష్ట్రాన్ని దొంగ ఓట్లు, దొంగ నోట్ల రాజ్యంగా జగన్ చేశారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.
అమరావతి: రాష్ట్రాన్ని దొంగ ఓట్లు, దొంగ నోట్ల రాజ్యంగా జగన్ చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దొంగ ఓట్ల ముద్రణ మంత్రుల ప్రమేయంతో జరగలేదా? అని ప్రశ్నించారు. కేసులు నమోదైన 12 మంది వైసీపీ వాళ్లు కదా?.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఏం చేస్తున్నారని నిలదీశారు. వెనక్కి పంపామని డీజీపీ చెప్పిన 250 బస్సులు ఎవరివని అన్నారు. ఓటమి భయంతోనే ఈ విధంగా చేశారని యనమల ఆరోపించారు.
టీడీపీ ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని యనమల కోరారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలన్నారు. దొంగ ఓట్లు, దొంగ నోట్ల వెనుక ఉన్న మంత్రులు, వైసీపీ నేతలపై తక్షణమే కేసులు పెట్టాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.