మంత్రివర్గం అవినీతి, దుబారా చేస్తున్నందునే..: యనమల
ABN , First Publish Date - 2021-08-05T22:07:58+05:30 IST
మంత్రివర్గం అవినీతి, దుబారా చేస్తున్నందునే..: యనమల
అమరావతి: మంత్రివర్గం అవినీతి, దుబారా చేస్తున్నందునే సమాచారాన్ని రాజ్యాంగ సంస్థలకు తెలియకుండా తొక్కిపెట్టారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కాగ్ నివేదిక, అసెంబ్లీలో పెట్టే ఎఫ్ఆర్బీఎం రిపోర్టులు, బడ్జెట్ ఎక్స్పెండిచర్ సీఎఫ్ఎంఎస్ను ప్రజలకు అందుబాటులో ఉండేవన్నారు. సమాచారాన్ని పనిగట్టుకుని లీక్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం గుర్తించాలన్నారు. మంత్రివర్గం చేసిన తప్పిదాలకు అధికారులు, ఉద్యోగులను బాధ్యులనుచేసి శిక్ష వేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.