జగన్‌ చేతకానితనంతో రాష్ట్రం దివాళా: యనమల

ABN , First Publish Date - 2020-06-01T08:36:49+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ చేతకానితనంతో రాష్ట్రాన్ని దివాళా తీయించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు.

జగన్‌ చేతకానితనంతో రాష్ట్రం దివాళా: యనమల

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ చేతకానితనంతో రాష్ట్రాన్ని దివాళా తీయించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మూలధన వ్యయం... అంటే అభివృద్ధి మీద ఖర్చుపెట్టే మొత్తం 50 శాతం పెంచితే, వైసీపీ ప్రభుత్వం 50శాతం కోతలు పెట్టిందన్నారు. టీడీపీ హయాంలో మొత్తం బడ్జెట్‌ వ్యయం ఏడాదికి 11.6 శాతం పెంచామని, అదే వైసీపీ హయాంలో 1.8 శాతం మాత్రమే పెరిగిందన్నారు. ఆదాయ వసూళ్లు తమ హయాంలో 11.8 శాతం పెరిగితే.. ఇప్పుడు 1.8 శాతమే పెరిగాయన్నారు. అదే అప్పులు మాత్రం టీడీపీ  హయాంలో 30.7 శాతం పెరిగితే... వైసీపీ పాలనలో దానికి మూడురెట్లు 135 శాతం పెంచేశారని ధ్వజమెత్తారని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు.

Updated Date - 2020-06-01T08:36:49+05:30 IST