చంద్రబాబు సవాల్ను వైసీపీ ఎందుకు స్వీకరించడం లేదు: యనమల
ABN , First Publish Date - 2020-08-04T21:33:50+05:30 IST
చంద్రబాబు సవాల్ను వైసీపీ ఎందుకు స్వీకరించడం లేదు: యనమల
గుంటూరు: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సవాల్ను వైసీపీ ఎందుకు స్వీకరించడం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ భయపడుతోందని, జగన్ విధ్వంస విధానాన్ని అమలు చేస్తున్నారని యనమల విమర్శించారు. రాజధాని అంశం ఓ కులానికి.. మతానికి చెందింది కాదని, మూడు రాజధానుల అంశం చిన్నదిగా చేసి చూస్తే రాష్ట్రానికి పెద్ద నష్టమన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతోందని, మన చేతుల్లో లేని న్యాయ రాజధానిని కర్నూలు తీసుకొస్తానని, జగన్ రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని యనమల విమర్శించారు.