కేశినేని నానిపై టీడీపీ నేత ఫైర్

ABN , First Publish Date - 2021-10-30T21:47:46+05:30 IST

టీడీపీ పార్లమెంటు నియోజకవర్గంలో అనర్హులకు పదవులిచ్చారని కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణారావు అన్నారు.

కేశినేని నానిపై టీడీపీ నేత ఫైర్

విజయవాడ: టీడీపీ పార్లమెంటు నియోజకవర్గంలో అనర్హులకు పదవులిచ్చారని కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణారావు అన్నారు. పార్టీ ముఖ్య నాయకులు తన పేరు సిఫార్సు చేసినా కొందరు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించి తనకు పదవి రాకుండా చేశారని మండిపడ్డారు. పార్టీలో సీనియర్ నేతలకు ఎంపీ కేశినేని నాని వల్ల అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతో కష్టపడి పని చేశానని గుర్తుచేశారు. పార్టీలు మారి వచ్చినవారికి టీడీపీలో రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని అవమానపరిచిన వారికి ప్రాధాన్యం ఇచ్చి సీనియర్లను మోసం చేస్తున్నారని చెప్పారు. టీడీపీ అధిష్టానం సీనియర్ల ఆవేదన అర్థం చేసుకోవాలని సూచించారు. విజయవాడలో పార్టీ బలోపేతానికి చంద్రబాబు, అచ్చెన్న చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2021-10-30T21:47:46+05:30 IST