వివేకా హత్యకేసులో 40వ రోజుకు సీబీఐ విచారణ

ABN , First Publish Date - 2021-07-16T18:27:24+05:30 IST

దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 40వ రోజు కొనసాగుతోంది.

వివేకా హత్యకేసులో 40వ రోజుకు సీబీఐ విచారణ

కడప: దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 40వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. నేడు పులివెందలకు చెందిన వివేకా సన్నిహితుడు ఎర్రగంగి రెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, మరో డ్రైవర్ బాబయ్య, మోహన్‌లను సీబీఐ బృందం విచారించింది. వీరిని ఇప్పటికే పలుమార్లు విచారించింది. మరికొంతమంది అనుమానితులను విచారించే అవకాశం ఉంది. 

Updated Date - 2021-07-16T18:27:24+05:30 IST