దళిత కుటుంబంపై వైసీపీ శ్రేణుల దాడి

ABN , First Publish Date - 2020-09-29T18:49:17+05:30 IST

ఓబులవారి పల్లెలో దారుణం జరిగింది.

దళిత కుటుంబంపై వైసీపీ శ్రేణుల దాడి

అనంతపురం జిల్లా: ఓబులవారి పల్లెలో దారుణం జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబంపై వైసీపీ అనుచరులు దాడి చేశారు. ప్రాణ భయంతో ఆ కుటుంబ సభ్యులు కదిరిలో ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. దాడి చేసిన వారి వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రొద్భలంతో విచక్షణారహితంగా తమపై దాడి చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు పక్షపాతం వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు.

Updated Date - 2020-09-29T18:49:17+05:30 IST