ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

ABN , First Publish Date - 2021-11-12T23:28:12+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. 11 మంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. 14 ఎమ్మెల్సీలలో 50 శాతం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. 11 మంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. 14 ఎమ్మెల్సీలలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరో 7 స్థానాలు ఓసీలకు కేటాయించారు. విజయనగరం స్థానిక కోటాలో ఇందుకూరి రఘురాజు, విశాఖ స్థానిక కోటా- వంశీకృష్ణ యాదవ్, వరదు కల్యాణి, తూర్పుగోదావరి స్థానిక కోటాలో అనంత విజయభాస్కర్, కృష్ణా స్థానిక కోటా - తలశిల రఘురాం, మొండితోక అరుణ్, గుంటూరు-మూరుగుడు హనుమంతరావు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, చిత్తూరు స్థానిక కోటాలో కృష్ణ రాఘవ భరత్, అనంతపురం స్థానిక కోటాలో వై.శివరామిరెడ్డి, ప్రకాశం స్థానిక కోటాలో తూమాటి మాధవరావులను ప్రకటించారు.

Updated Date - 2021-11-12T23:28:12+05:30 IST