వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2021-07-23T21:35:12+05:30 IST

ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో జరిగిన వివాదం వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. గంగాధర నెల్లూరు మండలం ఎట్టెరి వద్ద ఈ ఘటన జరిగింది.

వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

 చిత్తూరు: ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో జరిగిన వివాదం  వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. గంగాధర నెల్లూరు మండలం ఎట్టెరి వద్ద ఈ ఘటన జరిగింది.  వైసీపీ నేత,  ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ విజయానంద్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బ్యానర్లు ఒకే చోట కట్టాలనే విషయంలో ఒడ్డుపల్లి ఎట్టేరి గ్రామాల యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ వ్యవహారం కొట్టుకునే వరకు వెళ్లింది.  చిత్తూరు, పుత్తూరు రహదారిలోని  కోటగరం వద్ద బ్యానర్లు కట్టే విషయంలో ఇరు గ్రామాల యువకులు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మాట్లాడటంతో గొడవ సర్దుమణిగింది.

Updated Date - 2021-07-23T21:35:12+05:30 IST