మహిళాను కాపాడబోయి వైసీపీ కౌన్సిలర్ మృతి
ABN , First Publish Date - 2022-01-01T23:52:28+05:30 IST
మహిళను కాపాడబోయి వైసీపీ కౌన్సిలర్
తూర్పు గోదావరి: మహిళను కాపాడబోయి వైసీపీ కౌన్సిలర్ మృతి చెందిన సంఘటన జిల్లాలోని ముమ్మిడివరంలో జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ బొండాయికోడు ప్రాంతానికి చెందిన మహిళా వలంటీరు పెదపూడి లక్ష్మీకుమారి అన్నంపల్లి అక్విడేట్పై నుంచి గోదావరిలోకి దూకి ఆతహత్యాయత్నం చేసింది. వలంటీర్ అక్విడేట్ వద్ద అనుమానాస్పదంగా ఉండటం గమనించిన ఒక వ్యక్తి నగర పంచాయతీ 12వ వార్డు కౌన్సిలర్ భీమవరపు విజయ్కు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న కౌన్సిలర్ గోదావరిలోకి దూకిన మహిళా వలంటీర్ను సురక్షితంగా కాపాడాడు. దురదృష్టవశాత్తు కౌన్సిలర్ విజయ్ నీటిలో మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.