ప్రభుత్వ నిర్ణయంతో అల్లర్లకు అవకాశం: సోము

ABN , First Publish Date - 2020-08-15T08:43:30+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అవకాశవాద రాజకీయాల కోసం ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. 2018లో పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌పై జరిగిన దాడిలో...

ప్రభుత్వ నిర్ణయంతో అల్లర్లకు అవకాశం: సోము

అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం అవకాశవాద రాజకీయాల కోసం ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. 2018లో పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌పై జరిగిన దాడిలో నిందితులకు విముక్తి కల్పిస్తూ వారిపై కేసులు ఎత్తివేసిన జగన్‌ సర్కారు చర్యల్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయం సంఘ విద్రోహ శక్తులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా ఉందని ఆయన ట్వీట్‌ చేశారు ఇటువంటి నిర్ణయాలతో బెంగళూరు దాడుల వంటి ఘటనలు మన రాష్ట్రంలోనూ సంభవించే ప్రమాదం ఉందని ట్విటర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.    


Updated Date - 2020-08-15T08:43:30+05:30 IST