కార్యకర్తలకు అండగా ఉంటాం
ABN , First Publish Date - 2021-01-21T05:46:56+05:30 IST
పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు ఏ కష్టం వచ్చినా కేఈ కుటుంబం అండగా ఉంటుందని పత్తికొండ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు.
- పత్తికొండ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు
మద్దికెర, జనవరి 20: పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు ఏ కష్టం వచ్చినా కేఈ కుటుంబం అండగా ఉంటుందని పత్తికొండ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. బుధవారం మండలంలోని యడవలి గ్రామంలో మాజీ ఎంపీటీసీ మాబుసాబ్ను కేఈ శ్యాంబాబు పరామర్శించారు. అనంతరం విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సహకారంతో పత్తికొండ నియోజకవర్గంలో రూ.100కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ పురుషోత్తంచౌదరి, టీడీపీ జిల్లా కార్యదర్శి ధనుంజయుడు, మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, తెలుగుయువత నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్గౌడ్, మండల ప్రధానకార్యదర్శి పెరవలి రామాంజినేయులు, నాయకులు ఆకుల వేణుగోపాల్, రంగస్వామి, నెట్టికంటి నాగరాజు, టైలర్ హరి, మాజీ ఎంపీటీసీ శివశంకర్, కృష్ణ పాల్గొన్నారు.