వైసీపీ పాలనలో దళితులపై పెరిగిన దాడులు

ABN , First Publish Date - 2021-09-19T05:28:40+05:30 IST

వైసీపీ పాలన వచ్చిన నాటినుంచి దళితులపై దా డులు పెరిగిపోయాయని రాష్ట్ర మాలమహానాడు నాయకుడు నల్లా చిన్నారావు అన్నారు.

వైసీపీ పాలనలో దళితులపై పెరిగిన దాడులు

  • మాలమహానాడు రాష్ట్ర నాయకుడు చిన్నారావు 

అనపర్తి, సెప్టెంబరు 18: వైసీపీ పాలన వచ్చిన నాటినుంచి దళితులపై దా డులు పెరిగిపోయాయని రాష్ట్ర మాలమహానాడు నాయకుడు నల్లా చిన్నారావు అన్నారు. అనపర్తిలోని కళావేదిక ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీతానగరం మండలంలో గతేడాది దళిత యువకుడికి శిరోముండనం, ఇటీవల దళిత అధ్యాపకుడు దీపక్‌పై దాడి ఘటనల వెనుక ఎమ్మెల్యే జక్కంపూడి, ఆయన అనుచరుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. దీపక్‌పై దాడి కేసులో జక్కంపూడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వారంలో చర్యలు చేపట్టక పోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాలమహానాడు నాయకుడు గారా తాతారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T05:28:40+05:30 IST