త్వరలో అందుబాటులోకి సీఎం యాప్: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2020-05-28T01:57:35+05:30 IST

రైతులకు పూర్తి అండగా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని మంత్రి కన్నబాబు అన్నారు.

త్వరలో అందుబాటులోకి సీఎం యాప్: మంత్రి కన్నబాబు

అమరావతి: రైతులకు పూర్తి అండగా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని మంత్రి కన్నబాబు అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఏడాది పాలనకు గుర్తుగా మే 30న 10,641 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలతో పాటు రైతు కియోస్క్‌లు, టీవీలు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఏర్పాటుతో విజ్ఞాన, శిక్షణ కేంద్రాలుగా ఆర్బీకేలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఇంటర్నెట్ ద్వారా 5 లక్షల మంది రైతులతో ఒకేసారి ముఖ్యమంత్రి మాట్లాడేలా కార్యాచరణ రూపొందించామన్నారు. త్వరలోనే అందుబాటులోకి సీఎం యాప్రా నుందని తెలిపారు.  

 

Updated Date - 2020-05-28T01:57:35+05:30 IST