వివాహితపై.. వైసీపీ నేత అత్యాచారయత్నం..

ABN , First Publish Date - 2021-09-15T19:59:24+05:30 IST

అనంతపురం: బాలికలు, మహిళలపై దాడులకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అధికార పార్టీ నేతలు కూడా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా జరిగిన ఘటనే ఇందుకు

వివాహితపై.. వైసీపీ నేత అత్యాచారయత్నం..

అనంతపురం: బాలికలు, మహిళలపై దాడులకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అధికార పార్టీ నేతలు కూడా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. జిల్లాలోని పరిగి మండల పరిధి మోదా గ్రామంలో వివాహితపై వైసీపీ నేత అత్యాచారయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ నుంచి మోదా గ్రామానికి ఇటీవల ఓ కుటుంబం వలస వచ్చింది.


బుధవారం కుటుంబ సభ్యులంతా పనికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా మహిళపై గ్రామానికి చెందిన వైసీపీ నేత కుమారుడు అరుణ్‌కుమార్.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో సదురు మహిళ గట్టిగా కేకలు వేసింది. గమనించిన స్థానికులు.. తలుపులు బద్దలు కొట్టి మహిళను రక్షించారు. విషయం తెలియడంతో అరుణ్‌కుమార్.. పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - 2021-09-15T19:59:24+05:30 IST